హైదరాబాద్,15 డిసెంబర్ (జై మాధవ్ న్యూస్) టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారిని నియమించిన సందర్భంగా ఈ రోజు ముషీరాబాద్ నియోజీకవర్గనికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎం విజయ్ యాదవ్ అధ్వర్యంలో ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారిని వారి నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విజయ్ యాదవ్ మాట్లాడుతూ జాతీయ యాదవ నాయకులలో ప్రముఖ నాయకుడిగా పేరొందిన ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారికి టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించడం చాలా గర్వంగా ఉంది అని అన్నారు అలాగే రాబోవు రోజుల్లో లక్ష్మణ్ యాదవ్ గారిని ఒక్క ఎమ్మేల్యేగా చూడాలని విజయ్ యాదవ్ ఆకాంక్షిస్తున్నాను అని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు సురేష్, శంకర్, గౌతం, ముద్దం సాయి యాదవ్, హరీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆర్ లక్ష్మణ్ యాదవ్ కి ఘన సన్మానం.
లక్ష్మణ్ యాదవ్ గారిని ఎమ్మేల్యేగా చూడాలి - విజయ్ యాదవ్
![](https://jaimadhavnews.com/wp-content/uploads/2022/12/IMG_20221215_214055-scaled.jpg)