Search
Close this search box.

అఖిల భారత యాదవ మహాసభ, తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సుభ్యునిగా మెండ పరమేశ్వర యాదవ్

యాదవుల అభ్యునతికి కృషి చేస్తా

హైదరాబాద్ 26 జూలై (జై మాధవ్ న్యూస్):అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా గ్రేటర్ హైదరాబాద్ మల్లేపల్లికి చెందిన మెండ పరమేశ్వర యాదవ్ (వినోద్ యాదవ్) గారిని నియమిస్తూ బుదవారం రోజున రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ సమక్షంలో ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబు రావు యాదవ్ గారు. ఈ సందర్బంగా వినోద్ యాదవ్ మాట్లాడుతూ అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నన్ను నియమించినందుకు గాను చాలా సంతోషంగా ఉంది అన్నారు. నా పై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమించినందుకు అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబు రావు యాదవ్ గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారికి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల రవీందర్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం బాల మల్లేష్ యాదవ్,రాష్ట్ర కోశాధికారి దారబోయిన శ్రీనివాస్ యాదవ్,గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మైల్కోల్ మహేందర్ యాదవ్ మరియు సహకరించిన ప్రతిఒక్కరికీ ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు. యాదవ సంస్కృతిని కాపాడే విధంగా తగిన కృషి చేస్తానని, పాడి పషువులకు సంబంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు యాదవులకు లబ్దిపొందే విధంగా తగు చర్యలు తీసుకుంటామని అలాగే యాదవుల అభ్యునతికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబు రావు యాదవ్ మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారితో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం రాజేందర్ యాదవ్,ఎం బాల మల్లేష్ యాదవ్, రాష్ట్ర కోశాధికారి దారబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎడ్ల హరిబాబు యాదవ్, పోచబోయిన శ్రీహరి యాదవ్, రాష్ట్ర కార్యదర్శి దొంతిబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు రమేష్ యాదవ్ , జాతీయ యువజన కోఆర్డినేటర్ గొర్ల యశ్వంత్ యాదవ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఈ మనీష్ యాదవ్, రాష్ట్ర యువజన కార్యదర్శి ఏషం మల్లేష్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ యువజన అధ్యక్షులు ఎం విజయ్ యాదవ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం శశి యాదవ్, రాష్ట్ర కర్వవర్గ సభ్యులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Recent Post

Live Cricket Update